Breaking NewsHome Page SliderInternationalNewsNews Alert

 భారత్‌కు  తిరిగొచ్చిన జవాన్‌

భారత్ -పాక్ ఉద్రిక్తతల కారణంగా ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా బోర్డర్‌లో పోరాడుతున్న భారత్ బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ షాను పాక్ అధికారులు నిర్భంధించారు. తాజాగా అతడిని బేషరతుగా భారత్‌కు అప్పగించారు. పొరపాటున పాక్ భూభాగంలో అడుగుపెట్టాడన్న కారణంతో జవాన్‌ను నిర్భంధించిన పాక్ అధికారులు అతడిని 20 రోజుల పాటు బందీగా ఉంచారు. భారత్ నుండి బలమైన వత్తిడి రావడంతో చివరికి పాక్ పూర్ణమ్ షాను విడుదల చేయడంతో భారత్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇటీవల సీజ్ ఫైర్ ప్రకటించడంతో అతని భార్య భారత ప్రభుత్వాన్ని తన భర్తను విడుదల చేయించాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.