సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం కొత్తూరు ఎన్నికల ప్రచారంలో ఈటల
సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం కొత్తూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు.
• భూములు గుంజుకోవటానికి కేసీఆర్ ఇచ్చిన నోటీసులన్నీ రద్దు చేస్తాం. ఒక్క ఎకరం కూడా పోనివ్వము.
• హైదరాబాద్ దగ్గర ఉండటం గజ్వేల్కి శాపం అయింది. కేసిఆర్కి ఓటేసిన పాపానికి భూములన్నీ గుంజుకుంటున్నారు.
• నేను వస్తున్నానని తెలవగానే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయాడు. కెసిఆర్కి మీ మీద నమ్మకం లేదు.
• ఈటల రాజేందర్ పేదవాళ్ల వైపు, ధర్మం వైపు ఉంటాడు. అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడుతాడు.
• మీరు అధికారం ఇస్తే కెసిఆర్నే కాదు కేసీఆర్ జేజమ్మతో కూడా కొట్లాడతా.

