సహజీవనం చేసే వాళ్లకు షాకింగ్ న్యూస్
ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. అవును వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి (UCC) సోమవారం నుండి ఉత్తరాఖండ్ లో అమల్లోకి వచ్చింది.గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది.అయితే తాజాగా ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించా రు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నా రు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, విధానాల ను పూర్తి చేశామన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చా మని.. ప్రధాని మోదీ నాయ కత్వంలో ఆ ఎన్నికల్లో గెలి చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఉత్తరాఖండ్ ని ఆదర్శంగా తీసుకుని ఎన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తయో,ఎన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో చూడాలి.