సీఎంకు శక్తిపీఠం ఆహ్వానం
అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంబంధిత నిర్వాహకులు ఆహ్వానించారు. జోగులాంబ ఆలయ అర్చకులు సీఎంని కలిసి ఈ మేరకు దుశ్శాలువా కప్పి ఆహ్వాన పత్రికను, ఆశీర్వచనాలను అందజేశారు.అమ్మవారి ప్రసాదాలను సీఎంకి అందజేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..తప్పనిసరిగా ఉత్సవాలకు హాజరౌతానని హామీనిచ్చారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా ఉన్నారు.