Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNewsNews Alert

న‌డిరోడ్డుపై ఆర్టీసీ బస్సు ద‌గ్దం

ఉలవపాడు మండలం మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద హైవేపై శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 19 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి తిరువూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.బ‌స్సు నిండా పొగ అల‌ముకోవ‌డంతో బ‌స్సుని ర‌హ‌దారిపైనే నిలిపివేసి ప్ర‌యాణీకుల‌ను సినీ ఫ‌క్కీ త‌ర‌హాలో దించేశారు.దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ప్ర‌యాణీకుల్లో 8 మంది వృద్దులు కూడా ఉండ‌టం గ‌మనార్హం. ఆర్టీసి సిబ్బంది,అధికారులు,పోలీసులు,ర‌వాణా శాఖాదికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.