ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 1000 మందికిపైగా ప్రయాణికులు క్షతగాత్రులు అయ్యారు . ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహనాగ్ రైల్వేస్టేషన్ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. క్షతగాత్రులను సోరో, గోపాల్పూర్, ఖంటపాడ పీహెచ్సీలకు తరలించారు. బాలేశ్వర్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.

గూడ్స్ రైలును ఢీ కొట్టడం వల్ల కోరమాండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. మరో ట్రాక్పై పడిన బోగీలను అటువైపుగా వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా లెక్కించలేదని ఒడిశా సీఎస్ వెల్లడించారు.
ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్గ్రేషియో ప్రకటించారు. మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

