క్రీడా స్టేడియానికి వైఎస్సార్ పేరు తొలగింపు
ఆంధ్రప్రదేశ్లో పేర్లమార్పు వివాదం మరోసారి రాజకీయరచ్చ రేపుతోంది. ఇటీవలే వైయస్ఆర్ జిల్లా పేరును వైయస్ఆర్ కడప జిల్లాగా..వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. ఇప్పుడు తాజాగా విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు మాయమయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారని. బాపట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టారని ఆరోపిస్తున్నారు..వైసీపీ నేతలు. విశాఖలోని స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్నినిరసిస్తూ నేడు స్టేడియం దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చింది వైఎస్సార్ సీపి.గుడివాడ అమర్ నాథ్ నేతృత్వంలో విశాఖలో గురువారం ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

