accidentAndhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల్ని బలిగొంటున్నాయి

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు మళ్లీ మృత్యు శకటాలుగా మారాయి. ప్రయాణికుల భద్రతను పట్టించుకోకపోవడంతో మరొకసారి విషాదం చోటుచేసుకుంది. ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20కి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇది కొత్త విషయం కాదు — 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఆ దుర్ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన వారు నేర్చుకోలేదు.

అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల సాంకేతిక లోపాలు, సేఫ్టీ ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం — ఇవే మళ్లీ మళ్లీ ప్రాణాల్ని బలితీస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు కదిలి తనిఖీలు ప్రారంభిస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఉత్సాహం చల్లారిపోతుంది.

ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోకపోతే, ఇలాంటి విషాదాలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.