రాజకీయంగా తిరుగులేని సాయన్న
సాయన్న రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించి, 1994, 1999 నుండి 2004 వరకు జరిగిన మూడు వరుస ఎన్నికల్లో, పూర్వ ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర్రావు చేతిలో ఓడిపోయారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2014లో మళ్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత, అతను భారత రాష్ట్ర సమితి… అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2018 లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరుసార్లు హుడా… హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా పనిచేశాడు.

1951 మార్చిలో జన్మించిన సాయన్న ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి, ఎన్టీ రామారావు పార్టీ ప్రారంభించినప్పుడు టీడీపీలో చేరారు. 2015లో టీఆర్ఎస్లో చేరే వరకు ఆయన నమ్మకమైన టీడీపీ కార్యకర్తగా, నాయకుడిగా ఉన్నారు. విభజనకు ముందు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వీధిబాలల పునరావాసంపై హౌస్ కమిటీ సభ్యునిగా ఉంటూ ఎన్నో మంచి పనులు చేసిన ఘనత ఆయనది. పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కూడా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడుగా వ్యవహరించాడు. కుమార్తె లాస్య నందిత 2016లో హైదరాబాద్లోని కవాడిగూడ నుంచి మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ డిసెంబర్ 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు.

