ఆహారం వద్దు …గంజాయి ఇవ్వండి
దేశం ఉలిక్కిపడేలా చేసిన యూపీ నేవీ అధికారి దారుణ హత్యలో కళ్లుచెదిరే విషయాలు బయటపెట్టారు పోలీసులు. ప్రధాన నిందితులైన ముస్కాన్, సాహిల్ డ్రగ్స్కు బానిసలయ్యారని పోలీసులు గుర్తించారు. జైలులో కూడా తమకు ఆహారం వద్దని.. డ్రగ్స్, గంజాయి ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు.అరెస్టు నాటి నుంచి మత్తు దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు నిర్ధారించారు. జైలుకు వచ్చిన తొలిరోజు నుంచే తిండి తినక వారిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో సాహిల్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. సాహిల్ మానసిక స్థితి మందగించడంతో తోటి ఖైదీలపై దాడికి దిగే ఛాన్స్ ఉందన్న వైద్యుల సూచనతో జైలులోని డీ అడిక్షన్ కేంద్రంలో చికిత్స కొనసాగిస్తున్నారు.