నిమ్స్ ప్రొఫెసర్ ఆత్మహత్య
నిమ్స్లో ప్రొఫెసర్గా పని చేసే వ్యక్తి చెరువులో శవమై కనిపించిన ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెట్టుకానిగూడలో నివాసముంటున్న డాక్టర్ ఎం.విజయ భాస్కర్ (62) నిమ్స్ బయో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.ఈ నెల 25న వేకువజామున ఎవరికీ చెప్పకుండా తన సెల్ఫోన్లను ఇంట్లో పెట్టి బయటికి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య సుజాత సూరారం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సూరారం లింగం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విజయ భాస్కర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆన్లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న విజయ భాస్కర్, అప్పులు చేశాడని స్థానికులు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.