డాక్టర్పై కుమారై దురుసు ప్రవర్తన..క్షమపణలు చెప్పిన ముఖ్యమంత్రి!
తన కుమారై దురుసు ప్రవర్తన పట్ల మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా స్పందించారు. ఓ వైద్యుడిపై సీఎం కుమారై దాడి చేసిన ఘటనపై విమర్శలు రావడంతో ఆయనే స్వయంగా రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సీఎం కూమారై మిలారీ చాంగ్టే ఐజ్వాల్లో ఓ క్లినిక్కు వెళ్లారు.. అక్కడ డెర్మటాలజీ విభాగం వైద్యుడు అపాయింట్మెంట్ లేకుండా తాను చూడనని . క్లినిక్కి వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించారు. దాంతో మనస్తాపానికి గురైన చాంగ్టే మిలారీ నేరుగా వెళ్లి డెర్మాటాలజిస్ట్ అయిన ఆ డాక్టర్ ముఖంపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు, ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సంఘటన వైద్య వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) మిజోరం యూనిట్ నిరసన వ్యక్తం చేసింది. దాడిని ఖండిస్తూ 800 మందికి పైగా వైద్యులు నిరసన చేపట్టారు. డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి పని చేశారు. డాక్టర్లపై ఇటువంటి దాడులు మళ్లీ జరగకూడదని మేము కొరుకుంటున్నామని ఇండియన్ మెడికల్అ సోసియేషన్ (IMA) పేర్కొంది. దీంతో చివరకు ముఖ్యమంత్రి దిగి వచ్చారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పారు. స్వయంగా ఓ లెటర్ రాసి.. క్షమాపణలు కోరారు. ఆ పోస్ట్ను షేర్ చేశారు. అందులో ఓ డెర్మాటాలజిస్ట్తో తన కుమార్తె తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని, ఆమె ప్రవర్తనను తాను ఏ విధంగానూ సమర్ధించబోనని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు తన కూతురు మిలారీ ఛంగ్టేపై ఎలాంటి కఠిన చర్య తీసుకోనందుకు IMAకి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు ఛాంగ్టే అన్నయ్య కూడా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. మానసిక ఒత్తిడి కారణంగా తన సోదరి అలా ప్రవర్తించిందని వివరణ ఇచ్చారు.

