Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

తిరుమలలో అపచారం

భూలోక వైకుంఠం తిరుమలలో అపచారం జరిగింది. ఆలయానికి సమీపంలో గల రామ్‌భగీచా బస్టాండు వద్ద కొందరు గుడ్లు తింటూ పట్టుబడ్డారు. తిరుమలలో కేవలం శాఖాహారమే తీసుకోవాలనే సంగతి తెలిసిందే. 18 మంది బృందం ఈ అపచారానికి పాల్పడినట్లు తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఆహారాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీ కేంద్రాన్ని దాటుకుని ఈ నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.