ఆపరేషన్ సింధూర్పై మెగాస్టార్ మాట..
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పలువురు సెలబ్రిటీలు, ప్రజలు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్లో ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేసి, భారత సైన్యాన్ని అభినందించారు. అలాగే టాలీవుడ్ నుండి ఇతర ప్రముఖులు కూడా స్పందించారు. బేబీ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ.. ‘జైహింద్.. మనందరి ప్రార్థనలు భారత సైన్యానికి తోడుగా ఉంటాయి’ అని ఎక్స్లో పేర్కొన్నారు. ఇక ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైత్రి బోధ్ పరివార్ సంస్థ ద్వారా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ సందేశాన్ని షేర్ చేశారు. ఇక సీనియర్ నటుడు పరేశ్ రావల్ ఆపరేషన్ సింధూర్పై హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, సునీల్ శెట్టి, తాప్సీ పన్ను జైహింద్ అంటూ సోషల్ మీడియాలలో ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిగాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేశాయి. కోట్లీ, బహ్వాల్పూర్, మురిడ్కే, ముజఫరాబాద్లో దాడులు చేసింది. చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్పై దాడులు చేసింది.