Andhra PradeshBreaking Newscrimehome page sliderHome Page Slider

తల్లి, తమ్ముడిని కత్తితో హత్య చేసిన వ్యక్తి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. సుంకరపద్దయ్యగారి వీధి, మన్నా చర్చ్ ఎదురుగా జరిగిన ఘటనలో కుమారుడు తన తల్లి, తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు.

మృతులు గునుపూడి మహాలక్ష్మి (60), **గునుపూడి రవితేజ (33)**గా గుర్తించారు. ఈ ఘోర ఘటనకు కారణమైన గునుపూడి శ్రీనివాస్ స్వయంగా 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.

స్థలానికి చేరుకున్న భీమవరం వన్ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తూ, హత్యలకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.