ప్రేమపెళ్లి…గర్భిణి..అనుమానం..హత్య
ఇన్స్టాగ్రామ్లో లో పరిచయమయ్యారు.ప్రేమించుకున్నారు.చక్కగా పెళ్లి కూడా చేసుకున్నారు.భార్య కొద్ది నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందనగా భర్త అనుమానం పెంచుకున్నాడు.అనుకున్నదే తడవుగా భార్యను హతమార్చాడు.హైదరాబాద్ -కుషాయిగూడలోని నాగార్జున నగర్లో కాచిగూడ రాజ్మాహల్లాకు చెందిన సచిన్ సత్యనారాయణ(21)కు కాప్రాకు చెందిన ఠాకూర్ స్నేహ(21)తో 2021లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో 2022లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కొన్ని నెలల పాటు ఇద్దరూ దూరంగా ఉన్నారు.ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల క్రితం భార్యతో మళ్లీ రాజీ కుదుర్చుకుని నాగార్జుననగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజుల అనంతరం భార్య ఏడు నెలల గర్భవతి అని తేలడంతో సత్యనారాయణకు ఆమెపై అనుమానం ఏర్పడింది.ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్య ఏడు నెలల గర్భిణీ ఎలా అయిందని అనుమానంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 16న తెల్లవారు జామున స్నేహతో గొడవపడ్డ సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.దీంతో కడుపులో ఉన్న ఏడునెలల పిండం కూడా బయటపడింది. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు.