కేటీఆర్ సంచలన నిర్ణయం
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ నేడు అసెంబ్లీ సాక్షిగా తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అవయవదానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. “మనం ప్రజా ప్రతినిధులం. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రతీ నియోజకవర్గంలోనూ అవయవదానంపై చైతన్యం తేవాలి”. అని పేర్కొన్నారు. అవయవదానం బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.