రాజు గారి చేపలు మళ్లీ వచ్చేస్తున్నాయి…
తెలంగాణాలో కేఎఫ్ బీర్లు మళ్లీ వచ్చేస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ఈ వార్త వినగానే మందుబాబులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రభుత్వానికి, బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ కి మధ్య ధరల విషయంలో అవగాహన కుదరకపోవడంతో ఇకపై తెలంగాణాలో కేఎఫ్ బీర్ల సప్లై నిలిచిపోనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే.. తెలంగాణాలో కేఎఫ్ బీర్ల సరఫరా నిలిచిపోలేదని తెలుస్తోంది.. తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ఈ మేరకు సోమవారం యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో కీలక చర్చల తర్వాత కేఎఫ్ బీర్ల సరఫరాను మళ్ళీ ప్రారంభించాలని యునైటెడ్ బ్రూవరీస్ నిర్ణయించినట్లు తెలిపింది. అయితే.. ప్రస్తుతం ఉన్న ధరలకే సప్లై చేస్తారా లేక ధరలు పెంచుతారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ధరల విషయంపై త్వరలోనే సమాచారం ఇస్తామని సంస్థ తెలిపింది.

