Home Page SliderTelangana

రాజశ్యామల యాగంలో పూజ చేస్తున్న కేసీఆర్ దంపతులు

తెలంగాణ: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం చేపట్టారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగానికి ఇవాళ అంకురార్పణ మొదలైంది. పీఠాధిపతులకు సాష్టాంగ దండ ప్రమాణం చేసిన తదుపరి కేసీఆర్ దంపతులు యాగంలో కూర్చున్నారు. మూడు రోజులు జరిగే ఈ యాగంలో రేపు వేదపారాయణాలు, హోమం నిర్వహిస్తారు. చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.