Home Page SliderNationalNews Alert

ఢిల్లీలో దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లిన కారు

దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం తెల్లవారు జామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా… వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దుస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు కారు నంబరు ఆధారంగా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర దిగ్ర్బాంతిని తెలియజేశారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని అభివర్ణించారు. నిందితులను ఉరి తీయాలన్నారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదని కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని చెప్పారు.