Home Page SliderNational

బంగ్లాతో టెస్టు మ్యాచ్‌లో విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

అక్షర్ పటేల్ చెలరేగడంతో బంగ్లాదేశ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 513 పరుగుల లక్ష్యం కోసం బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాందేశ్ తడబడుతోంది. ఆదివారం చివరి రోజున చాటోగ్రామ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవడానికి మరో 241 పరుగులు అవసరం ఉంది. ఇక ఇండియా మరో నాలుగు వికెట్లు పడగొడితే విజేతగా నిలుస్తుంది. బంగ్లా యువ ఆటగాడు జకీర్ హసన్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించగా, షకీబ్ అల్ హసన్ తన వికెట్ తర్వాత ఆతిథ్య జట్టును ఆదుకున్నాడు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఆతిథ్య జట్టు తమ ఛేజింగ్‌లో ఘనంగా ప్రారంభమైన తర్వాత ఇదంతా జరిగింది. శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా సెంచరీలతో భారత్ 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు, కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత భారత్ 404 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ను 150 పరుగులకు ఆలౌట్ చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించారు. కుల్దీప్ యాదవ్ 40 పరుగులకు 5 వికెట్లు సాధించాడు. షకీబ్ అల్ హసన్ అజేయంగా 40, మెహిదీ హసన్ మిరాజ్ 9 పరుగులతో నాటౌట్‌గా ఉండటంతో 272/6 వద్ద ఉంది.

courtesy bcci twitter