Home Page SlidermoviesNews AlertTelangana

ఇది కనిపెడితే.. పట్టుకుంటే పదివేలు..

వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తున్న ‘పథకం ప్రకారం’ అనే చిత్రానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో నాది లాయర్‌ పాత్ర. అందుకే అందరం లాయర్‌ గెటప్‌లో ఉన్నాం. సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అండ్‌ క్రిమినల్‌ లాయర్‌ని. అసలు నేను క్రిమినల్‌ లాయర్‌నా? లేక క్రిమినల్‌నా? ఒక నేరంతో లాయర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్‌కి గురిచేస్తుంది’ అన్నారు.  ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ‘పట్టుకుంటే పదివేలు’ పేరుతో ఓ కాంటెస్ట్‌ పెడుతున్నామని, ఇంటర్వెల్‌ లోపు విలన్‌ ఎవరో కనిపెడితే థియేటర్లోనే పదివేలు అందిస్తామని, యాభై కేంద్రాల్లో ఈ కాంటెస్ట్‌ నిర్వహించబోతున్నామని తెలిపారు. కథాపరంగా, సాంకేతికంగా ఈ సినిమా గొప్పగా ఉంటుందని నిర్మాత గార్లపాటి రమేష్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. శృతిసోధి, అశిమ నర్వాల్‌, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: రాహుల్‌రాజ్‌.