పడితే పిడుగులు….లేకుంటే వడగాలులు
తెలుగు రాష్ట్రాల ప్రజలు వడగాలుల, వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా, కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.వాతావరణ మార్పుల కారణంగా, ఛత్తీస్గఢ్ నుండి ఉత్తర కేరళ వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. ప్రజలు చురుకుగా ఉండాలని, వర్షాలు, వడగాలులు వీరే లేదా వాతావరణ మార్పులపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.