Andhra PradeshTrending Today

వైసీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే!?

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదన్నారు రఘురామకృష్ణరాజు చెప్పారు. జూన్ 4 తర్వాత వచ్చిన ఫలితాల తర్వాత జగన్ ఆశలు ఆవిరవుతాయన్నారు ట్రిపుల్ ఆర్. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం రావాలని, శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు.