Home Page SliderNational

సిగ్గు లేకుండా డ్యాన్సులు ఎలా చేస్తున్నావ్ ..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హేమాహేమీలు మట్టికరిచారు. కల్కాజీ స్థానం నుంచి గెలిచిన సీఎం అతిశీ మాత్రం సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి డ్యాన్సులు చేశారు. అతిశీ సెలబ్రేషన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో కుదేలైతే, అదేమీ పట్టనట్టు అతిశీ సిగ్గులేకుండా డ్యాన్సులు చేస్తున్నారు అంటూ మలివాల్ మండిపడ్డారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ భవిష్యత్ గురించి తలుచుకుని తీవ్ర వేదనకు గురవుతుంటే, అతిశీకి చీమకుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు.