Home Page SliderTelangana

రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయం: ఖర్గే

తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు పైగా రుణమాఫీ చేసేందుకు ఐఎన్‌సీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎఐసీసీ చీఫ్ ఖర్గే చెప్పారు. 16 ఏళ్ల కిందట యుపిఏ సర్కార్ 3.73 కోట్ల మంది రైతులకు రూ.72 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం రైతులపై 3 నల్ల చట్టాలను ప్రయోగించింది. కిసాన్ న్యాయ్ కింద రుణమాఫీ కమిషన్, మద్దతు ధరలు లాంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. మా అజెండా ఎప్పటికీ చెక్కుచెదరదు అని ట్వీట్ చేశారు.