Andhra PradeshHome Page Slider

ప్రముఖ జ్యోతీషుడికి హైకోర్టు షాక్

ప్రముఖ జ్యోతీషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై నమోదైన కేసులో మహిళా కమిషన్ చర్యలు తీసుకోవచ్చని పేర్కొంటూ స్టే ఎత్తివేసింది. వారం రోజుల్లోగా తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సూచించింది. స్టేను ఎత్తి వేస్తూ మహిళా కమిషన్ కు పూర్తి అధికారం ఇచ్చింది. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సమయంలో వాళ్ల జంట విడాకులు తీసుకుంటారని చెప్పి వివాదంలో ఇరుక్కొన్నారు. దీనిపై మహిళా కమిషన్ లో కేసు నమోదైంది.. విచారణకు హాజరు కావాలంటూ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనను విచారించే అధికారం కమిషన్ కు లేదంటూ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు స్టే ఇచ్చింది. వారం రోజుల్లోగా విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.