చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా
చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతకొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా ఈ రోజు కూడా చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.అయితే ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ నెల 17న మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు ఈ కేసును విచారణ చేస్తామని న్యాయమూర్తులు వెల్లడించారు. ఇవాళ సీఐడీ తరుపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు కేసులో నేరం జరిగి 5 ఏళ్లు అయినా ఇప్పటికీ FIR నమోదు చేయలేదన్న చంద్రబాబు తరుపు న్యాయవాది వాదనలను ఆయన తిప్పికొట్టారు. కాగా నేరం 5 ఏళ్ల కిందట జరిగినా ఇప్పుడు FIR నమోదు చెయ్యొచ్చని చెప్పారు. అనంతరం చంద్రబాబు కేసులో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సెక్షన్ 17A అనేది అవినీతికి రక్షణ కాకుడదని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు.