అనంతబాబు కేసును సీబీఐ అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ
డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసును సీబీఐకి అప్పగించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వ్యక్తులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫుటేజ్కు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ను 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. హత్య విషయంలో వారి పాత్రను నిర్ధారించి వాటికి సంబంధించిన వివరాలతో అదనపు అభియోగ పత్రాలను దాఖలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తుది చార్జ్ షీట్ను మూడు నెలల్లో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.