Andhra PradeshBreaking NewscrimeHome Page SliderTelangana

రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం

రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ రవాణాదారులు మాత్రం ఏదో విధంగా వాటిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్​మెట్​ పరిధిలో గురువారం అధికారులు భారీగా గంజాయి సీజ్​ చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్​కు తరలించే క్రమంలో ముందస్తు సమాచారంతో మహేశ్వరం ఎస్​వోటీ సిబ్బంది, అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. అధికారుల తనిఖీల్లో భాగంగా 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్​ చేశారు. కంటైనర్​ను కూడా సీజ్​ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.