Breaking NewscrimeHome Page SliderTelangana

బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో ఐదుగురు వ్య‌క్తులు… బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఇంటికి వెళ్తున్న బాలిక‌ను వెంబ‌డించి వాహ‌నంలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.త‌ర్వాత బాలిక‌ను వేరే ప్రాంతంలో వ‌దిలి వెళ్లారు. ఇంటికి చేరుకుని జ‌రిగిందంతా త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించింది.దీంతో బాలిక‌ను తీసుకెళ్లి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. యువకులను అదుపులోకి తీసుకొని పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.