accidentAndhra PradeshHome Page SliderNews Alert

కడపలో ఘోర ప్రమాదం..ఐదుగురి మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద వెళ్తున్న కారును లారీ బలంగా ఢికొట్టింది. ఘాట్ మలుపులో వెళ్తున్న కారు పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒక చిన్నారి మగ్గురు మహిళలు ఉన్నారు. వీరు రాయచోటి నుండి కడపకు వెళ్తున్నట్లు సమాచారం.