Home Page SliderNews AlertTelangana

గోషామహల్‌లో తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్‌ గోషామహల్ ప్రాంతంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన శంకుస్థాపన విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 12 గంటల ప్రాంతంలో గోషామహల్‌లోని ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంలో ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు అల్లర్లు చేస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్థానికుల ఇబ్బందులను గుర్తించడం లేదని మండిపడుతున్నారు. బంద్‌లకు పిలుపు ఇవ్వడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆసుపత్రి కడితే తమకు రోగాలు, మార్చురీ వాసనలు వస్తాయని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిని గోషామహల్ వంటి ఇరుకైన ప్రాంతంలో చేస్తే చాలా కష్టం. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు మునిగిపోతాయి. అత్యవసర సేవల కోసం ప్రజలు ఈ ఇరుకు రోడ్లలో ఆసుపత్రిని వేగంగా చేరుకోలేరని, ముఖ్యమంత్రి మరోసారి ఈ నిర్ణయాలని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.