ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్లోని ఓ యూనివర్సిటీకి ఓ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. అయితే.. ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగానే ఉన్నారు. బుర్ద్వాన్లో యూనివర్సిటీకి ఓ ఈవెంట్కు గంగూలీ తన రేంజ్ రోవర్ కారులో బయలుదేరారు. ఆయనతో పాటు మరో రెండు కార్లు కూడా కాన్వాయ్లా వస్తున్నాయి. దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వేపై ఉన్న కమ్రంలో ఆయన కాన్వాయ్లోకి సడెన్గా ఓ లారీ దూసుకొచ్చింది. దాంతో కాన్వాయ్లోని కార్లు అదుపుతప్పాయి. అయితే గంగూలీ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ అప్లై చేయడంతో ఆయన కారు వెనుక వస్తున్న మరో కారు రేంజ్ రోవర్ను ఢీ కొట్టింది.అయితే ఆయ సమయంలో కాన్వాయ్ సాధారణ వేగంతోనే ఉండటంతో ఎవరీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. వెంటనే కారు దిగిన గంగూలీ తన వెనుక కాన్వాయ్లో వస్తున్న వారిని పరామర్శించారు. ఓ పది నిమిషాల పాటు ఆయన హైవే పైనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతా క్లియర్ చేసి.. గంగూలీ యూనివర్సిటీ వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన గురించి తెలిసి క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు.