Home Page SliderNationalNews Alert

మామిడి చెట్టుపై కోటి రూపాయలు.. జప్తు చేసిన ఐటీ అధికారులు

ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ దూసుకుపోతున్నాయి. మరో వైపు కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇప్పటిదాకా 300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్‌ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే 82 కోట్ల రూపాయలను స్వాధీనం చేశారు. తాజాగా మైసూరులో ఓ వ్యక్తి ఇంట్లోని పెరట్లో చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అశోక్‌కుమార్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు సుబ్రమణ్య రాయ్‌ ఇంట్లో అధికారులు  సోదాలు చేశారు. మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్‌ చేశారు.