crimeHome Page SliderNationalPolitics

కుంభమేళా తొక్కిసలాటపై కాంగ్రెస్ నేతలు ఫైర్..

మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ప్రభుత్వ నిర్వహణాలోపం, వీఐపీలపై ప్రత్యేకశ్రద్ధ  వంటి చర్యలతోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని,  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దీనిపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదాయ విదారకంగా ఉందని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విటర్లో తెలియజేశారు. ఈ ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.