చికాగోలో సీఎం షికారు
అమెరికాలోని చికాగోలో తమిళనాడు సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ చికాగో వీధుల్లో సముద్రపు ఒడ్డున సైకిల్ తొక్కుతూ షికారు చేశారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తమిళనాడుకు పెట్టుబడుల కోసం అమెరికాలో వివిధ కంపెనీల ప్రముఖులతో భేటీ అయ్యారు స్టాలిన్. అక్కడ డ్రైవర్ లేకుండా ట్యాక్సీలో ప్రయాణించారు. డ్రైవర్ లేని ట్యాక్సీ రూపొందించిన అమెరికన్లను అభినందించారు. టెక్నాలజీని మెచ్చుకున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని, కావలసిన అన్ని మౌలికవసతులు కల్పిస్తామని అమెరికాలో స్థిరపడిన తమిళియన్ వ్యాపారవేత్తలను కోరారు. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశమైన ముఖ్యమంత్రి తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రీసెర్చ్ ల్యాబ్ ల ఏర్పాటుకు గూగుల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

