యాదగిరీశుడి దర్శనానికి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పునస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకున్నారు. యాదగిరీశునికి ప్రత్యేకపూజలు చేయించారు. ఆయన వెంట మంత్రులు కూడా దర్శనానికి వెళ్లారు. నేడు రెండున్నర కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పాదయాత్రను చేయాలని సంకల్పించారు రేవంత్ రెడ్డి. సంగెం నుండి మూసీ వెంట ఈ పాదయాత్రను చేస్తారు. దర్శనం అనంతరం యాదగిరి మున్సిపల్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్ష చేయనున్నారు.

