Andhra PradeshHome Page Slider

ఏపీలో మారుతున్న పరిణామాలు…జనసేనలోకి ముద్రగడ

టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. వ్యక్తిగతంగా తాను ముద్రగడతో సమావేశమయ్యానన్నారు జ్యోతుల నెహ్రూ.. వచ్చే ఎన్నికల్లో తనకు ముద్రగడ పూర్తి సహకారం అందిస్తామన్నారని ఆయన వివరించారు. ఏ పార్టీలో చేరాలన్నదానిపై ముద్రగడ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారాయన. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ముద్రగడ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు జ్యోతుల నెహ్రూ. ఒకవేల టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే.. ముద్రగడతో మరోసారి సమావేశమవుతానన్నారు.