టీజీపీఎస్సీకి కొత్త ఛైర్మన్ నియామకం
టీజీపీఎస్సీకి కొత్త ఛైర్మన్గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు వెంకటేశం. డిసెంబర్ 3 నాటికి ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఐఏఎస్గా విద్యాశాఖలో పనిచేస్తున్న బుర్రా వెంకటేశంను నియమించారు.

