తెలంగాణాకు అదనపు న్యాయమూర్తుల నియామకం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక అదనపు న్యాయమూర్తిగా తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు కొనసాగుతారని ఉత్తర్వులు ఇచ్చారు. రేణుకా యార, నర్సింగ్ రావు నందికొండ, మధుసూధన్ రావులు తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రెండేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొన్నారు.