Andhra PradeshBreaking NewsHome Page SliderNews AlertPoliticsTrending Today

వల్లభనేని వంశీకి మరో షాక్..

వైసీపీ నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. నేడు ఈ కేసుపై విచారణ జరగగా, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. దీనితో వంశీకి ఈ కేసులో ఇంకా ఊరట లభించలేదు.