ముంబైలో అమితాబ్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు..
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ గత కొంత కాలంగా రియల్ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ముంబైతో సహా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తోంది. గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ ఏకంగా రూ.200 కోట్లు రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే అమితాబ్ ఫ్యామిలీ తాజాగా ఒకేసారి పది ఫ్లాట్స్ను కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నివేదిక ప్రకారం.. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని ములుంద్ వెస్ట్లో రూ.25 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ను కొనుగోలు చేశారు. మొత్తం 10 ఫ్లాట్స్ను ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.24.95 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 3, 4 బీహెచ్కే ఫ్లాట్స్ రెడీ టు మూవ్ కండిషన్లో ఉన్నట్లు తెలిసింది. ఈ ఫ్లాట్స్ మొత్తం 10,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ప్రతి ఫ్లాట్కు రెండు కార్ పార్కింగ్ స్థలాలు బిల్డర్ కేటాయిస్తారు.