త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా తెలంగాణ టూర్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంలో తెలంగాణలో నిర్వహించే రెండు బహిరంగ సభల్లో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగిస్తారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభలు ఏర్పాటు చేశామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. వీటిలో భాగంగానే ఈ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గ నుంచి ఇందుకోసం 250 మంది ప్రముఖులను ఎంపిక చేసినట్లు తెలిపారు.