రైలు ప్రయాణికులకు అలెర్ట్..
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ప్రయాణికులకు కీలక విజ్ఞప్తి చేశారు. కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో కన్ఫర్మ్ అయిన రైల్వే టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్లోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. వీటిలో న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, వంటి ముఖ్యనగరాలతో సహా దేశవ్యాప్తంగా దాదాపు 60 రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ సరైన కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి రానిచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ లేకపోయినా, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నా వారంతా వెయిటింగ్ ఏరియాలో ఉండాలని సూచించారు. అలాగే అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేస్తామన్నారు.