చిన్నారులకు ఆధార్ క్యాంపులు షురూ
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 0–6ఏళ్ల చిన్నారుల కోసం ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభించింది. ఇవాల్టి నుంచి 24 వరకు, తిరిగి 27వ తేదీ నుంచి 30 వరకు ఆధార్ నమోదు చేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,06,264 మంది చిన్నారుల్లో 9,80,575 మంది నేటికీ ఆధార్ నమోదు చేసుకోలేదని పేర్కొంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

