అమెరికాలో కారు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసుల మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. మృతుల్లో హైదరాబాద్ చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డల్లాస్ లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఉండిపోయారని తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా వారిని భారతీయులుగా పోలీసులు గుర్తించారు.

