కొత్త జంట ఆత్మహత్య
ఓ కొత్త జంట ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి నడుద్దామనుకున్న ఆ ప్రేమికులు ఏడడుగులు వేసిన రెండు వారాలకే అనంత లోకాలకు చేరారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో గుడిలో ఓకటయ్యారు. ఇంతలోనే ఒకే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసిన ఈ విషాద ఘటన కలకలం రేపింది.ఫరూఖాబాద్కు చెందిన ఒక యువకుడు ఫిబ్రవరి 17న తన స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి కుటుంబాలు ఈ బంధానికి వ్యతిరేకించాయి. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తరువాత, వారిద్దరూ ఘజియాబాద్లోని కవినగర్కు వచ్చి అద్దె ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఇక్కడ ఏదో జరిగింది. వారిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారు రాసిన సూసైడ్ నోట్ చూసి, పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ అవుట్ పోస్ట్ పరిధిలోని మహేంద్ర ఎన్ క్లేవ్ లోని ఒక ఇంట్లో ఒక జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కవి నగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా ఇల్లు తలుపు మూసి ఉందని గుర్తించారు. పోలీసు బృందం FSL బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించింది. దీని తరువాత, పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దీంతో ఓ జంట మృతదేహాలు ఉచ్చుకు వేలాడుతూ కనిపించాయి.మృతదేహాలను అన్ హ్యాంగ్ చేసి పోస్టుమార్టానికి పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

