Breaking NewsHome Page SliderInternationalLifestyleNews Alert

ఇండియాలో బోణీ కొట్టిన HMPV వైర‌స్ కేసు

రూపొందించ‌డంలో వెనుక నుంచి ముందుంటారు….ఉప‌యోగించ‌డంలో ముందు నుంచి ముందుటారు.ఇదీ భార‌తీయుల‌కు అమెరిక‌న్లు పెట్టిన సామెత‌.అంటే ఏదైనా వ‌స్తువుని కొత్త‌గా తయారు చేయాలంటే మ‌న వాళ్ల‌కు ఏళ్ల‌కేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.అదే ఏ దేశంలో త‌యారైన ఏ వ‌స్తువైనా స‌రే దాన్ని ఇమ్మీడియెట్‌గా వాడేసే వాళ్ల‌లో ఇండియ‌న్స్ ప్ర‌ధ‌మ వ‌రుస‌లో ఉంటార‌ని అర్ధం.క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసి అక్క‌డ కుప్ప‌లు తెప్ప‌లుగా కేసులు న‌మోదైతే… ఆ త‌ర్వాత వెంట‌నే దానికి సంబంధించిన కేసులు ఇండియాలోనే న‌మోద‌య్యాయి త‌ప్ప ఉప‌ఖండంలో (పాకిస్తాన్‌,ఆఫ్ఘ‌నిస్తాన్‌,శ్రీ‌లంక‌,బంగ్లాదేశ్‌,నేపాల్,మాల్దీవులు,మారిష‌స్‌) ఎక్క‌డా న‌మోదు కాలేదు.ఇప్పుడు కొత్త వైర‌స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ప్ర‌స్తుతం చైనాని క‌కావిక‌లం చేస్తున్న HMPV వైర‌స్ కేసు బెంగుళూరులో బోణీ కొట్టింది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది. ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.దీంతో సౌత్‌లో కొత్త వైర‌స్ బోణీ కొట్టిన‌ట్లైంది.