బాబోయ్..కేరళ లో మరోమారు నిఫా వైరస్
కేరళలో నిపా వైరస్ ముప్పు మరోసారి పొంచి ఉంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్, ఎర్నాకుళం జిల్లాలను జూనోటిక్ ఇన్ఫెక్షన్లకు హాట్స్పాట్లుగా ఆరోగ్య శాఖ గుర్తించింది.రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ వైరస్ వినాశనం 2018 సంవత్సరంలో కనిపించింది. తరువాత 2019, 2021, 2023, 2024, ఇప్పుడు 2025 లోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది జూనోటిక్ వైరస్. జూనోటిక్ వైరస్లు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వైరస్లు. నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాలు, పందుల ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. కానీ ఒకసారి ఒక వ్యక్తి దీని బారిన పడితే, అది వ్యక్తి నుండి వ్యక్తికి సంపర్కం ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. 1998లో మలేషియాలో తొలిసారిగా నిపా వైరస్ కేసు నమోదైంది. ఇది పందుల నుండి మనుషులకు వ్యాపించిందని నిర్ధారించబడింది. భారతదేశంలో 2001, 2018లో నిపా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి.